మట్టి వినాయకులను పూజిద్దాం

4 Sep, 2016 23:35 IST|Sakshi
మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
–ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడదామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రామకృష్ణసేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయం వద్ద మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు నీటి కాలుష్యం అవుతుందన్నారు. దీంతో మనిషి మనుగడమే ప్రమాదమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, సురేష్, ప్రభాకర్, సంఘం నాయకులు పాల్గొన్నారు. 
 
 
 
 

 

>
మరిన్ని వార్తలు