మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట

2 Oct, 2016 22:46 IST|Sakshi
మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట
వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వివిధ వస్తువుల కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడాయి. మెుత్తంగా దేవాలయ పరిసరాలు భక్తులో సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన సిబ్బంది సదుపాయాలు కల్పించారు. 
 
మరిన్ని వార్తలు