సీతానగరం (తాడేపల్లి రూరల్): పట్టణ పరిధిలోని సీతానగరం ‘సీత’ కార్యాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ ప్రచారకుల శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీత డైరెక్టర్ రాఘవాచార్యులు, ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.