ఢిల్లీలో మాల సంఘం నాయకుల ధర్నా

10 Aug, 2016 00:00 IST|Sakshi
మందమర్రి : ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మాల సంఘం ఆ«ధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పట్టణ మాల సంఘం నాయకులు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల సంఘం పట్టణ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్‌ మాట్లాడుతూ దళితుల ఐక్యత దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు సుప్రీం కోర్టు సైతం వర్గీకరణ సరైంది కాదని తీర్పు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీక్షలో కూర్చున్న వారిలో మెయ్య రాంబాబు, పల్లే నర్సింహులు, కొండ రాములు, బావండ్ల వీరస్వామి తదితరులున్నారు.  
 
మరిన్ని వార్తలు