ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా

20 Jul, 2016 23:27 IST|Sakshi
 
 ఆత్మకూరు : భారతీయ జనతా యువమోర్చా ఆత్మకూరుశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆళ్ల మధుసూదన్‌ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో కామన్‌ఫీజు విధానాన్ని అమలుచేయాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయగిరి ప్రతాప్, ఉపాధ్యక్షుడు కొల్లి హరినాయుడు, కార్యవర్గసభ్యులు దేవరపాటి మాధవ్, ఎస్‌డీ ఖాజారంతుల్లా, నాయకులు పూనపాటి రాజేష్, ఓబుల పవన్, బి.మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు