దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం

19 Aug, 2016 17:38 IST|Sakshi
తంగడి దత్తభీమేశ్వరాలయంలో అన్నదానం
మాగనూర్‌ (తంగడి ఘాట్‌ సాక్షి బృందం): కృష్ణా పుష్కరాల సందర్భంగా మాగనూరు మండలం తంగడి దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం కొనసాగుతుంది. కృష్ణ, భీమా నదుల సంగమ క్షేత్రంలో పుస్పుల దత్తపీఠాధిపతి విఠల్‌బాబా దత్తభీమేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీపాద వల్లభుడు తిరుగాడిన ఆనవాల్లు ఇక్కడవున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు మారెప్ప, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్‌రెడ్డిని పలుకరించగా నిత్యం వేలాదిమంది పుష్కర భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. 
మరిన్ని వార్తలు