పైలేరియా నివారణ మాత్రల పంపిణీ

31 Aug, 2016 00:39 IST|Sakshi
పైలేరియా నివారణ మాత్రల పంపిణీ

రేపాల : మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం పైలేరియా వ్యాధి నివారణ (డీఈసీ)మాత్రలను  పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారి పోరెడ్డి వెంకటపాపిరెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా రేపాల పీహెచ్‌సీ పరిధిలో గల పలు గ్రామాలలో గల పాఠశాలలు, దళిత కాలనీలు, వసతి గహాల్లో ఈ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది లక్ష్మినారాయణ, కళావతి, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు