గుండెపోటుతో ఏఆర్‌ ఎస్సై మృతి

10 Oct, 2016 21:57 IST|Sakshi
  • మృతుడు డిప్యూటీ స్పీకర్‌ వద్ద ఎస్కార్ట్‌
  • నిజామాబాద్‌ క్రైం :
    నిజామాబాద్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌కు చెందిన ఎస్సై ఎండీ సలాం ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. సంగారెడ్డికి చెందిన సలాం నిజామాబాద్‌కు రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆయన సంగారెడ్డి జిల్లాకు ఆప్షన్‌ కింద పెట్టుకున్నారు. ఆయనను పోలీస్‌ అధికారులు సంగారెడ్డి ఏఆర్‌కు అటాచ్‌గా నియమించారు. అనంతరం ఏఆర్‌ ఎస్సై డిప్యూటీ స్పీకర్‌ పద్మదేవేందర్‌రెడ్డి వద్ద ఎస్కార్ట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం డిప్యూటీ స్పీకర్‌ వెంట సిద్దిపేట్‌కు వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో సిబ్బంది వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేట్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం మృతదేహాన్న ఆయన స్వస్థలం సంగారెడ్డికి అంత్యక్రియల కోసం తరలించారు. అంత్యక్రియలో సంగారెడ్డి ఆర్‌ఐ చెన్న కేశవరావు, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షకీల్‌ పాష, దుర్గారెడ్డి, సంగారెడ్డి కోశాధికారి ఆసీఫ్‌అలీ, నిజామాబాద్‌ ఏఆర్‌ ఎస్సైలు సయ్యద్‌ ఇబ్రహీం, నజీమొద్దీన్‌లు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు