డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

7 Aug, 2016 23:16 IST|Sakshi
ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ప్రభాకరరావు
గార: వమరవల్లి ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఆదివారం డైట్‌సెట్‌–2016 కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలోని ఒక ప్రభుత్వ, సుమారు 25 ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎ.ప్రభాకరరావు పరిశీలించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్‌  తెలిపారు. పరిశీలనలో సీనియర్‌ అధ్యాపకులు పురుషోత్తం, ధర్మరాజు తదితరులు ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు