దిగ్విజయ్ సింగ్ రాక నేడు

30 Jun, 2013 06:55 IST|Sakshi
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదివారం విశాఖ వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2 గంటలకు విశా ఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి నగరంలోనే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 9.55 గంటలకు విమానంలో బెంగళూరుకు పయనమవుతారు.
 
సర్వే సత్యనారాయణ కూడా...
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ ఆదివారం విశాఖ వస్తున్నారు. సాయంత్రం 5.55 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 6.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. మరుసటి రోజు సోమవారం ఉదయం 11 గంటలకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులను తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులో సమీక్ష నిర్వహిస్తారు. 
 
మరిన్ని వార్తలు