డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

6 Aug, 2016 16:49 IST|Sakshi
ఏయూక్యాంపస్‌ : ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో నిర్వహిస్తున్న పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య పి.బాబీవర్థన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్‌ రిలేషన్స్‌లో పీజీ డిప్లమో, ఫొటోగ్రఫీ, జర్నలిజంలో డిప్లమో కోర్సులకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఈ నెల 14న ఉదయం పీజీ డిప్లమో కోర్సులకు, మధ్యాహ్నం 2 గంటలకు డిప్లమో కోర్సులకు ప్రవేశాలు జరుపుతారు. ఆసక్తి కలిగిన వారు ఫీజు వివరాలు, దరఖాస్తులను ఏయూ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు 
 
మరిన్ని వార్తలు