అమెరికా వెళ్లాల్సిన వృద్ధుడు అదృశ్యం

7 Oct, 2015 18:39 IST|Sakshi
అమెరికా వెళ్లాల్సిన వృద్ధుడు అదృశ్యం

అమెరికా వెళ్లడానికి నగరానికి వచ్చిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సూర్యారావు(65) అమెరికాలో ఉంటున్న కుమారుడు, కూతురు దగ్గరికి వెళ్లడానికి ఈనెల 6 తేదీ ఉదయం శాలివాహననగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు.

 

సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి వెళాల్సి ఉండగా.. 4 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన బంధువులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. సూర్యారావుకు మతిమరుపు ఉన్నట్లు బంధువు రామకృష్ణ పోలీసులకు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 

మరిన్ని వార్తలు