టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు

30 Oct, 2016 15:42 IST|Sakshi
టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు టీడీపీ ఇంఛార్జ్‌ అన్నా రాంబాబు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై చర్చించారు.

టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి తొక్కేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో​ జోక్యం చేసుకోవాలని అన్నా రాంబాబును కోరారు. కార్యకర్తల ఒత్తిడితో అన్నా రాంబాబు.. అశోక్‌ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
 

మరిన్ని వార్తలు