చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో జిల్లాస్థాయికి ఎంపిక

12 Dec, 2016 14:27 IST|Sakshi
బద్వేలు అర్బన్‌ : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో పట్టణంలోని సాయి చైతన్య ఇంగ్లిషు మీడియం హైస్కూల్‌ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్‌ పంగా నరసింహారెడ్డి శనివారం తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన సి.సాయిణి, కె.భానుప్రకాష్‌రెడ్డి, ఎన్‌.వి.సాయిశ్రావణిలను అభినందించారు.  జిల్లాస్థాయిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు.   
>
మరిన్ని వార్తలు