ఇదేనా ‘చెత్త’శుద్ధి?

22 Mar, 2016 04:23 IST|Sakshi

రోడ్డుపై చెత్త వేసిన వైన్స్ నిర్వాహకులు
మందలించి.. జరిమానా విధించిన కలెక్టర్

సంగారెడ్డి మున్సిపాలిటీ: చెత్తను రోడ్డుపై పారబోసిన షాపు యజమానికి జిల్లా కలెక్టర్ జరిమానా విధించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న కనకదుర్గ వైన్స్ నిర్వాహకులు చెత్తను రోడ్డుపై వేస్తూ తొలగించడం లేదు. సోమవారం రాత్రి కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఇంటికి వెళ్తూ.. వైన్స్ ఎదుట పోగుపడిన చెత్తను గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దుకాణం యజమానిని తీవ్రంగా మందలించడంతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఇకపై దుకాణదారులు చెత్తను రోడ్డుపై పారబోస్తే జరిమానా విధిస్తామని, వరుసగా మూడుసార్లు ఇదే తప్పు చేస్తే సదరు దుకాణం లెసైన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు