28న జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నీ

18 Feb, 2017 00:56 IST|Sakshi

ఆత్మకూరు (రాప్తాడు) : రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పి.యాలేరు గ్రామంలో ఈ నెల 28 నుంచి జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్‌వైకే బృందం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ టోర్నీ ఉంటుందన్నారు. విజేత జట్టుకు రూ. 8వేలు, రన్నర్స్‌ జట్టుకు రూ.5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 97012 29767, 99668 02067, 98853 32097లో సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు