నేడు, రేపు పవిత్ర సంగమం వద్ద దీపావళి

27 Oct, 2016 21:41 IST|Sakshi
నేడు, రేపు పవిత్ర సంగమం వద్ద దీపావళి

ఇబ్రహీంపట్నం : రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో స్థానిక పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద శుక్ర, శనివారాల్లో దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. భారీ నరకాసురుడి ప్రతిమను తయారుచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమాల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తున్నారు. చివరిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ‘నరకాసుర వధ’ కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు పర్యాటక శాఖ ఆధీనంలో జరుగుతున్నాయి. బాణ సంచా వెలుగుల్లో ఈ కార్యక్రమంగా ఘనంగా నిర్వహించనున్నారు.







 

మరిన్ని వార్తలు