రాజధానికి రైలు షురూ

18 Jul, 2016 01:54 IST|Sakshi
అనంతపురం న్యూసిటీ : విజయవాడ–ధర్మవరం(17215) రైలు ఆదివారం ఉదయం ‘అనంత’కు వచ్చింది. ఇక నుంచి ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో ధర్మవరం నుంచి విజయవాడకు ఈ రైలు బయలుదేరుతుంది. అలాగే విజయవాడ నుంచి ధర్మవరానికి (17216) వారంలో మూడు రోజుల పాటు వస్తుంది. ఈ నెల 12న రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు రైలును ప్రారంభించిన సంగతి విదితమే.  
సాధారణ బోగీలేవి..?
ధర్మవరం – విజయవాడ రైలులో తొమ్మిది రిజర్వేషన్‌ బోగీలున్నాయి. అందులో 6 స్లీపర్, రెండు త్రీ టైర్, ఒక టూ టైర్‌ బోగీలు ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజానీకానికి నిరాశ మిగిలింది. కనీసం రెండు బోగీలైనా ఏర్పాటు చేసింటే బాగుండేదని ప్రయాణికులు అంటున్నారు.   
>
మరిన్ని వార్తలు