ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు

17 Sep, 2016 18:34 IST|Sakshi
ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు
మర్రిగూడ : కస్తూరిబా పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌ఓతోపాటు ఉపాధ్యాయులంతా తరచు గైర్హాజరు కావద్దని ఆర్‌వీఎం జిల్లా జీసీడీఓ ఎం.సుశీల అన్నారు. శనివారం మర్రిగూడ కస్తూరాబా పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చడించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంనతం పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పాఠశాల ఎస్‌ఓ పనితీరు బాగాలేక పోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని  సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మంచి బోధన అందించాలన్నారు. ఆమెవెంట ఎంఈఓ ఎం.సుధాకర్‌ ఎస్‌ఓ వాసవి, తదితరులు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు