మంత్రి పుల్లారావుపై డొక్కా ఫైర్

13 Feb, 2016 13:47 IST|Sakshi
మంత్రి పుల్లారావుపై డొక్కా ఫైర్

గుంటూరు : గుంటూరు జిల్లాలో అధికార టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంపై మంత్రి పుల్లరావు వ్యాఖ్యలు సరికావని, పుల్లారావుతో సహా మంత్రులు ఎవరైనా అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. మంత్రి పుల్లారావు తాను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖపై పూర్తి స్థాయిలో దృష్టిపెడితే మంచిదని సూచించారు.

సున్నితమైన అంశాన్ని మాటల ద్వారా జటిలం చేయడం సరికాదని హితవు పలికారు. మాదిగలకు మంద కృష్ణనే నాయకుడని, మందకృష్ణ నాయకత్వానికి పుల్లారావు సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. ఎస్పీ వర్గీకరణ అంశంపై ఆదివారం మంద కృష్ణ సహా మాదిగ నేతలతో సమావేశమవుతానని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని డొక్కా తెలిపారు.

మరిన్ని వార్తలు