నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

21 Sep, 2016 23:49 IST|Sakshi
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
 
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
 శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నిడమానూరు ప్రాంతానికి చెందిన దాత రూ.లక్ష విరాళాన్ని బుధవారం ఆలయ అధికారులకు అందజేశారు. నిడమానూరుకు చెందిన కొత్తపల్లి వందన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ ఏఈవో అచ్యుతరామయ్యను కలుసుకుని నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116ల విరాళాన్ని అందించారు.
 
మరిన్ని వార్తలు