ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

22 May, 2017 00:07 IST|Sakshi
ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

అనంతపురం రూరల్‌ : హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఎ.నారాయణపురం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. 8 కాండ్ల ఒంగోలు జాతి ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొనగా ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన రాజన్న ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. యల్లనూరు మండలానికి చెందిన రామలింగారెడ్డి ఎద్దులు రెండవ స్థానంలోనూ, ఆత్మకూరు మండలానికి చెందిన రాజగోపాల్‌ ఎద్దులు మూడవ స్థానంలోనూ నిలిచాయి.

నార్పల మండలం జంగంరెడ్డిపేటకు చెందిన రామలింగ వృషభాలు నాల్గో స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా రూరల్‌ మండల జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్‌ రూ.20వేలు, రెండవ బహుమతిగా నారాయణపురం గ్రామానికి చెందిన పి.నారాయణస్వామి రూ.15 వేలు, మూడో బహుమతిగా ఎంపీటీసీ సభ్యుడు నాగేంద్ర రూ.10వేలు, నాల్గో బహుమతిగా లక్ష్మీనారాయణ రూ.5వేలు అందజేశారు. అనంతరం గ్రామంలోని అనంత వీరాజంనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు.

మరిన్ని వార్తలు