అనుమానంతో భార్య హత్య

1 Jul, 2016 02:59 IST|Sakshi

* పరారీలో భర్త
* అనాథగా మారిన కుమారుడు

పెద్దపంజాణి: అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సుద్దగుండ్లపల్లె గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(30), అదే గ్రామానికి చెందిన పరమేశ్వరి(30) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి చందు (9) అనే కుమారుడు ఉన్నాడు. సుబ్రమణ్యం కూలి పనులు చేసుకుంటూ భార్య, కొడుకును పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సుబ్రమణ్యం మద్యానికి బానిసగా మారాడు.

అంతేగాక భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పనులకు వెళ్లకుండా పూటుగా మద్యం సేవించి భార్యను వేధించడం మొదలు పెట్టాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి వచ్చిన భర్తతో భార్య గొడవ పడింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన భర్త ఇంట్లో ఉన్న కత్తితో భార్య పరమేశ్వరిని హత్య చేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పరమేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి పరారీకావడంతో బాలుడు చందు అనాథ అయ్యాడు. సంఘటనా స్థలాన్ని గంగవరం సీఐ రవికుమార్ పరిశీలించారు. ఎస్‌ఐ సురేష్ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు