రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ మృతి

17 Mar, 2017 23:54 IST|Sakshi

మడకశిర : గుడిబండ మండలం హిరేతుర్పి వద్ద మంగళవారం టిప్పర్, కారు ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ హనుమంతరాయప్ప(55) బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు గుడిబండ పోలీసులు తెలిపారు. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని శిర తాలూకా కరిదాసనహళ్లి గ్రామానికి చెందినవాడు కావడంతో గుడిబండ ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని ఆ గ్రామానికి తరలించారు. ఇదిలా ఉండగా ఇదే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు