లారీ డ్రైవర్‌ నరకయాతన

2 Sep, 2017 12:07 IST|Sakshi
లారీ డ్రైవర్‌ నరకయాతన

అశ్వారావుపేటరూరల్‌: లారీ అదుపుతప్పి రహదారి పక్కనున్న గుంతలో పడిపోయింది. అందులోని డ్రైవర్, క్లీనర్‌ క్యాబిన్‌లో చిక్కుకుపోయారు. దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇనుప రాడ్ల లోడుతో విశాఖపట్నానికి వెళ్తున్న లారీ అర్థరాత్రి సమయంలో అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం వద్దగల మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న భారీ గుంతలో పడిపోయింది.

ఆ తరువాత చెట్టును ఢీకొంది. లారీ క్యాబిన్‌ నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌ ఖాజిదే, క్లీనర్‌ చోటు ఇరుక్కుపోయారు. చాలాసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హెడ్‌ కానిస్టేబుల్‌ బాబురావు, పోలీస్‌ సిబ్బంది వచ్చి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సాధ్యపడకపోవడంతో సర్పంచ్‌ తెల్లం వీరకుమారి భర్త దుర్గారావు సహాయంతో స్థానిక యువకులు, జేసీబీతో క్యాబిన్‌ ఇరుక్కుపోయిన క్షతగ్రాతులను బయటకు తీశారు. డ్రైవర్‌కు కాలు విరిగింది. క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు