డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. యువకుడికి జైలు

7 Sep, 2016 19:06 IST|Sakshi

రామాయంపేట: మద్యం తాగి వాహనం నడిపిన (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌) కేసులో యువకుడికి  రూ. 5 వందల జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష పడినట్లు స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ తెలిపారు. నాగార్జునగౌడ్‌ గత నెల 28న రామాయంపేట వద్ద  వాహనాల తనిఖీ చేపట్టగా కామారెడ్డికి చెందిన ఎండీ మోసిన్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో యువకుడిని బుధవారం మెదక్‌ కోర్టుకు తరలించారు. నిందితుడికి రూ.500 జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బల్జిత్‌సింగ్‌ తీర్పు చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు