ఏలూరు సిటీ : డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక వన్టౌన్ హాయ్ హోటల్ రోడ్డులోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో నిర్వహించనున్నట్టు సంఘం నాయకులు సాయిరామ్ ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్టికెట్ నెంబర్లతో విధిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివరాలకు 97047 25013, 89851 03482 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.