ఇకపై వధూవరులకు దుర్గమ్మ ఆశీస్సులు

27 Oct, 2016 23:01 IST|Sakshi
ఇకపై వధూవరులకు దుర్గమ్మ ఆశీస్సులు

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి వచ్చే నూతన వధూవరులకు దుర్గమ్మ దర్శనంతో పాటు వేదపండితుల ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేసే కార్యక్రమానికి దుర్గగుడి అధికారులు శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆలయ అధికారులు ఈ విధానాన్ని ప్రారంభించారు. గురువారం ఈ భాగ్యాన్ని పొందిన వధూవరులు ఎంతో ఆనందించారు. దుర్గమ్మ స్వయంగా తమను ఆశీర్వదించిందని సంతోషం వ్యక్తం చేశారు.







 

మరిన్ని వార్తలు