రైల్వేస్టేషన్‌లో దుర్గమ్మ ప్రసాదం రెడీ

5 Oct, 2016 23:37 IST|Sakshi
రైల్వేస్టేషన్‌లో దుర్గమ్మ ప్రసాదం రెడీ
విజయవాడ (రైల్వేస్టేçÙన్‌) : 
దుర్గగుడి అధికారులు రైల్వేస్టేçÙన్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ప్రసాదాలను బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్‌లో ఆదివారం నుంచి ప్రసాదం అందుబాటులో లేదు. ఈ విషయాన్ని బుధవారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై దుర్గగుడి అధికారులు స్పందించారు. రైల్వేస్టేçÙన్‌లోని కౌంటర్‌కు ప్రసాదాలను పంపారు. ఈ మేరకు మధ్యాహ్నం నుంచి భక్తులకు ప్రసాదం విక్రయిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు 24 గంటలు ప్రసాదం విక్రయిస్తామని సిబ్బంది తెలిపారు. 
 
 
మరిన్ని వార్తలు