విజయవాడ: పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం బందరు రోడ్డులో కె.ఎస్. వ్యాస్ కాంప్లెక్స్లో పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీసుల విధి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం దాని ఆవశ్యకత అనే అంశంపై నిర్వహించారు. 65మంది కానిస్టేబుల్స్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయివరకు పాల్గొన్నారు. డీసీపీ (అడ్మిన్) జి.వి.జి. అశోక్ కుమార్ పర్యవేక్షించారు.