కోదాడఅర్బన్ : రాష్ట్రంలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ కోరారు. శనివారం కోదాడ పట్టణంలోని వాసవీభవన్లో జరిగిన నియోజకవర్గ పోలింగ్ బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో నాయకులు కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, యాదా రమేష్, వంగవీటి శ్రీనివాసరావు, బొలిశెట్టి కష్ణయ్య, కోమటి కష్ణయ్య, సాతులూరి హనుమంతరావు, కనగాల నారాయణ, వీరబాబు, అక్కిరాజు యశ్వంత్, రాధాకష్ణ, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, కిలారు వెంకటేశ్వర్లు, సాంబశివరావు, కౌసల్య, వసుంధర, నాగమణి, భాగ్యమ్మ పాల్గొన్నారు.