తమ్ముడి గొంతుకోసిన అన్న

4 May, 2017 19:19 IST|Sakshi

యాదాద్రి భువనగిరి: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గురువారం దారుణం జరిగింది. తోడబుట్టన తమ్ముడి గొంతు కోశాడో అన్న. వివరాల్లోకి వెళ్తే డోప్ప నర్సింహా, డోప్ప హరికిషన్‌లు అన్నదమ్ములు. చెల్లెలి పెండ్లి విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన అన్న హరికిషన్ బీరుబాటల్, కత్తితో తమ్ముడు నర్సింహపై దాడి చేశాడు. నర్సింహ పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హైద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు