మృత్యువులోనూ వీడని బంధం

2 Dec, 2016 19:05 IST|Sakshi

సిద్దిపేట రూరల్: భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతిచెందిన సంఘటన సిద్దిపేట మండలం బంజేరుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆకుల మల్లవ్వ (60), లస్మయ్య(65)లు భార్యభర్తలు. వీరికి ఐదుగురి సంతానం. వారందరికి వివాహాలు జరిపించారు.

రెండు నెలల క్రితం మల్లవ్వకు ఎముకలకు సంబంధిత వ్యాధి సోకి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె మంచానికే పరిమితం కాగా, గత కొంత కాలంగా భర్త లస్మయ్య సపర్యలు చేస్తూ కాలం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మల్లవ్వ పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో గత రెండు నెలలుగా భార్యకు అన్ని విధాల సేవ చేసి ఆమెతో బంధాన్ని పెనవేసుకున్న భర్త లస్మయ్య గుండెపగిలి మృతిచెందాడు. గంట వ్యవధిలో భార్యా భర్తలు మృతిచెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

మరిన్ని వార్తలు