నల్లగొండ జిల్లాలో దొంగల ఘాతుకం

18 Apr, 2016 10:34 IST|Sakshi

- గొలుసు కోసం వృద్ధురాలి హత్య
తిప్పర్తి(నల్లగొండ జిల్లా)

నల్లగొండ జిల్లా తప్పర్తి మండలం పెద్ద సూరారం గ్రామంలో ఘోరం జరిగింది. దొంగతనానికి వచ్చిన దుండగులు.. ఓ వృద్దురాలిని హత్యచేసి.. బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం వేకువ జామున జరిగింది. రాములమ్మ(65) ఇంటి ముందు నిద్ర పోతుండగా.. గుర్తు తెలియని దుండగులు వచ్చి గొంతునులిమి ఆమెను హత్య చేశారు. మెడలో ఉన్న 3తులాల గొలుసును దోచుకెళ్లారు. ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.



 

మరిన్ని వార్తలు