రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

13 Sep, 2016 22:05 IST|Sakshi
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

తాడిపత్రి టౌన్‌ : రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు తాడిపత్రి విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్‌ బాబా మంగళవారం తెలిపారు. అనంతపురంలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన స్కూల్‌గేమ్స్‌ పోటీలు యు–14 విభాగంలో కైవల్య(అరవింద స్కూలు), లోకేశ్వర్‌కుమార్‌( టార్గెట్‌ స్కూలు), మానస(నారాయణ స్కూలు) ఎంపికయ్యారన్నారు.

యు–17 విభాగంలో ఫిరోజ్‌(సాయితేజ స్కూలు), నిఖిత (సాయివిజేత) ఎంపికైనట్లు వివరించారు. చిత్తూరులో ఈ నెలాఖరులో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కూలు గేమ్స్‌ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు