విద్యుత్ వైర్లు తెగి వాహనదారుడు మృతి

29 May, 2016 11:44 IST|Sakshi

భారీ ఈదురుగాలులకు 11కేవీ విద్యుత్ వైర్లు తెగి మీద పడడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శివారులోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని జగ్గుతండాకు చెందిన బుల్డోజర్ డ్రైవర్ భూక్యా మోహన్‌గా గుర్తించారు.

 

>
మరిన్ని వార్తలు