చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గురువారం వేకువజామున పందేలమడుగు, రామకుప్పం గ్రామాల రైతులకు చెందిన మామిడి తోటలు, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దాదాపు 10 ఏనుగులు సమీపంలోని అట వీ ప్రాంతం నుంచి వచ్చి రూ.8 లక్షల వరకు నష్టం కలిగించాయని రైతులు తెలిపారు.