కరీంనగర్ స్పోర్ట్స్ :జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పెన్షనర్ల భవన్లో జరిగిన జిల్లాస్థాయి అండర్ 19, 25 చదరంగ పోటీలు ముగిశాయి. పోటీలకు జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్ 25 విభాగంలో కె.విశ్వనాథ్, కె.శ్రీనివాస్, స్రవంతి, సుష్మారెడ్డి, మధురవాణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా చదరంగ సమాఖ్య బాధ్యులు పాల్గొన్నారు.