అనంతపురం ఎడ్యుకేషన్ : సమ్మేటివ్–1 పరీక్షల్లో భాగంగా 6–10 తరగతులకు ఈ నెల 24న జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్ష 29కు వాయిదా వేసినట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. డెంగీ వ్యాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ³రీక్ష వాయిదా వేసినట్లు వారు వెల్లడించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయరాదని, ప్రశ్నపత్రాలకు తక్కువ వచ్చి ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతేకాని జిరాక్స్ చేయించకూడదని స్పష్టం చేశారు.