కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): ఎస్సీఈఆర్టీ తయారు చేసిన సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన విధివిధానాలను డీఈఓ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ఓ ప్రకటనలో ప్రధానోపాధ్యాయులు/కరస్పాండెంట్లను కోరారు. ఇందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మూల్యంకన విధివిధానాలు ఉన్నాయన్నారు. అంతేకాక ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల బండిళ్లను ఈనెల 13వ తేదీలోపు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలని ఆయన ఆదేశించారు.