నరసాపురం: నరసాపురం రైల్వేస్టేషన్లో దాదాపు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో ప్లాట్ఫారంపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన రైల్వే కానిస్టేబుల్ వై.మనోహర్ విషయాన్ని ఏఎస్సై బి.రమణ దృష్టికి తీసుకువెళ్లారు. 108 ద్వారా అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని ఆచూకీ తెలియరాలేదు. వివరాలు తెలిసిన వారు సెల్ 94406 97655 నంబర్లో సంప్రదించాలని ఏఎస్సై రమణ కోరారు.