కొత్త నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్

14 Dec, 2016 15:00 IST|Sakshi

విజయనగరం: కొత్త నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కొత్త నోట్లకు అదనంగా 20 శాతం పాత నోట్లు ఇస్తామని తొమ్మిది మంది ఉన్న ముఠా ప్రజలను నమ్మిస్తోంది. గత కొంత కాలం నుంచి నోట్లను మార్పిడి చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారి వద్ద ఉన్న రూ.2.10 లక్షలు విలువైన కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు