శ్రీమఠంలో మాజీ క్రికెటర్లు

21 Aug, 2016 00:20 IST|Sakshi
శ్రీమఠంలో మాజీ క్రికెటర్లు
మంత్రాలయం(కర్నూలు): ఆరాధనోత్సవాల సందర్భంగా శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం భారత మాజీ క్రికెట్‌ క్రీడాకారులు వెంకటేష్‌ ప్రసాద్, విజయ్‌భరద్వాజ్‌ శనివారం  మంత్రాలయం వచ్చారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డితో కలిసి రాఘవేంద్రస్వామి మూలబృందావనం, గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీమఠం అసిస్టెంట్‌ మేనేజర్‌.. క్రీడాకారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రాలు, ఫల, పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు.
మరిన్ని వార్తలు