కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్‌బాస్‌

24 Sep, 2016 00:19 IST|Sakshi
కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్‌బాస్‌
కర్నూలు: మాజీ పోలీస్‌బాస్‌ (డీజీపీ) జేవీ రాముడు కర్నూలుకు వచ్చి వెళ్లారు. అనంతపురంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యంలో శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఏపీఎస్‌పీ పటాలంలో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆకె రవికృష్ణ, పటాలం కమాండెంట్‌ గోగినేని విజయకుమార్, అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌ శశికాంత్, గోపాలకృష్ణ తదితరులు ఆయనకు పూలబోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. జిల్లాలోని శాంతి భద్రతలతో పాటు ఏపీఎస్‌పీ రెండో పటాలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జేవీ రాముడు ఆరా తీశారు. ఆయుధాగారంతో పాటు స్కూలు, పార్కు, పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలో వాటిని ప్రారంభించనున్నట్లు కమాండెంట్‌ వివరించారు.   
 
మరిన్ని వార్తలు