నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు: 13 మంది అరెస్ట్

16 Apr, 2016 13:49 IST|Sakshi

విజయవాడ : నకిలీ కరెన్సీ ముఠా గుట్టును విజయవాడ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షల దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి... తమదైన శైలిలో వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే పట్టుబడిన నిందితులు అంతా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ వాసులను పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు