కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

8 Aug, 2016 00:35 IST|Sakshi
హసన్‌పర్తి : కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌ మృతిచెందిన సంఘటన హసన్‌పర్తిలో ఆదివారం జరిగింది. ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన  నల్ల రాజు(33)కు భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రీలత భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 
>
మరిన్ని వార్తలు