ఎండిన పంటను చూసి రైతు గుండె ఆగింది

2 Oct, 2015 17:56 IST|Sakshi

చొప్పదండి : అప్పుల బాధతో మరో రైతు గుండె ఆగింది. కర్నూలు జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ కారుపాకలపల్లి గ్రామానికి చెందిన కారుపాకల రాములు (32) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంటలు సరిగా పండకపోవడలేదు.

ఈ ఏడాది వేసిన పత్తిపంటకు గురువారం మందు కొడుతుండగా.. పంట ఎండిపోవడాన్ని చూసి తట్టుకోలేక... గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే రాములుని ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాములు మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు