జగిత్యాల: అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం శానబండలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు(32) పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.