విద్యుదాఘాతంతో రైతు మృతి

8 Jul, 2017 23:02 IST|Sakshi
విద్యుదాఘాతంతో రైతు మృతి

కనగానపల్లి(రాప్తాడు) : మండలంలోని తూంచర్ల గ్రామంలో శనివారం విద్యుదాఘాతానికి గురై రైతు వన్నూరప్ప (42) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..  రైతు వన్నూరప్ప తన ఇంటి ముందు ఉన్న ఇనుప రేకులను పక్కకు సర్దుబాటు చేస్తుండగా, పైన ఉన్న విద్యుత్‌ తీగలు వాటికి తగిలాయి. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి.. కాపాడేలోపు అతడు మృత్యువాత పడ్డాడు.

అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మధ్యనే పొలంలో రెండు బోర్లు వేసి పంటలు సాగుచేశామని, అలాగే కూతురు పెళ్లి, కుటుంబ అవసరాల కోసం రూ.నాలుగు లక్షల దాకా అప్పు చేసినట్లు అతడి భార్య ముత్యాలమ్మ కన్నీటి పర్యతమైంది. 

మరిన్ని వార్తలు