ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్

30 Jun, 2016 12:14 IST|Sakshi

అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంస్థకు రూ. 7 వేల కోట్లు రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పంట తోటల సాగును ప్రోత్సహిస్తామన్నారు.

రుణమాఫీ పెండింగ్ బకాయిలను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చిరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో రూ. 24 వేల కోట్ల రుణాలును మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు